అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 93,759 శాంపిల్స్ను పరీక్షించగా 3,464 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో 35 మంది చనిపోయారు. కాగా 4,284 మంది కొవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు. తాజా పాజిటివ్ కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,93,923కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 37,323గా ఉంది.
జిల్లాల వారీగా నమోదైన కొవిడ్ మరణాల వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు, ప్రకాశంలో ఐదుగురు చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరులో నలుగురు చొప్పున, కృష్ణ, శ్రీకాకుళంలో ముగ్గురు చొప్పున, అనంతపూరం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరంలో ఇద్దరు చొప్పున, వైఎస్ఆర్ కడప, కర్నూలు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు.