మేడ్చల్ మల్కాజిగిరి : చేపలు పట్టడానికి చెరువు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి ఈత రక చెరువులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
ఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ముత్తుస్వామి కాలనీకి చెందిన కేశవరావు (35) తన తల్లితో కలిసి నివాసముంటున్నాడు.
చేపలు పట్టడానికి శనివారం చెన్నాపురం చెరువు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడ్డ కేశవరావుకు ఈత రాకపోవడంతో మృతి చెందాడు. ఆదివారం ఉదయం స్థానికులు చెరువు బయట ఉన్న బట్టలు, చెప్పులు, చెరువు నీటిలో కనిపించిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
భక్తులతో కిక్కిరిసిన ‘మల్లన్న’ క్షేత్రం
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి : మంత్రులు
జొన్నకుప్ప దగ్ధం.. రూ.45వేల నష్టం
ఆలస్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు పనితీరు తగ్గుతుందట..!
లారీని ఢీకొట్టిన కారు..వ్యక్తి మృతి
నిజామాబాద్లో వృద్ధ దంపతుల ఆత్మహత్య