న్యూఢిల్లీ: దేశీయ ఎగుమతుల్లో పురోగతి నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే, గత నెల ఎగుమతుల్లో 47 శాతం గ్రోత్ రికార్డైంది. విదేశాలకు ఎగుమతుల విలువ రూ.32.46 బిలియన్ల డాలర్లకు చేరుకున్నది. ఇంజినీరింగ్, జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఉత్పత్తులతో ఇది పెరిగిందని తెలుస్తున్నది. అయితే వాణిజ్య లోటు 9.4 బిలియన్ల డాలర్లుగా ఉందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
2020 జూన్ నెలలో ఎగుమతులు 22 బిలియన్ల డాలర్లు కాగా, 2019లో 25 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి. గత మే నెలలో ఎగుమతులు 32.27 బిలియన్ల డాలర్లు, ఏప్రిల్లో 31 బిలియన్ల డాలర్లుగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే, జూన్లో దిగుమతులు 96.33 శాతం పెరిగి 41.86 బిలియన్ల డాలర్లకు చేరాయి. కానీ, గతేడాది దిగుమతులు 21.32 బిలియన్ల డాలర్లకు పరిమితం అయ్యాయి. 2019లో దిగుమతులు 41 బిలియన్ల డాలర్ల వద్ద నిలిచాయి.
2019 జూన్లో వాణిజ్య లోటు 16 బిలియన్ల డాలర్లు. గతేడాది 41.26 శాతం తగ్గి 0.71 బిలియన్ల డాలర్ల సర్ప్లస్గా నిలిచింది. కానీ ఈ ఏడాది జూన్లో 1,426.6 శాతం విస్త్రుతమై 9.4 బిలియన్ల డాలర్లకు చేరుకున్నదని వాణిజ్యశాఖ తెలిపింది.
ఈ ఏడాది ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఎగుమతులు 95.36 బిలియన్లు పెరిగాయి. గతేడాది 51.44 బిలియన్ల డాలర్లకు మాత్రమే పరిమితం. దేశ చరిత్రలో తొలిసారి ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అత్యధిక ఎగుమతులు జరిగాయని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.