న్యూఢిల్లీ, మార్చి 19: ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ 12 శాతం వృద్ధిరేటును నమోదు చేయవచ్చని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 0.4 శాతం వృద్ధిని కనబర్చిన నేపథ్యంలో మూడీస్ పైవిధంగా ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ ప్రభావం వల్ల వృద్ధి రేటు మధ్య జూలై-సెప్టెంబర్లో మైనస్ 7.5 శాతానికి, ఏప్రిల్-జూన్లో మైనస్ 23.9 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. కాగా, దేశ, విదేశీ మార్కెట్లలో డిమాండ్ పుంజుకుంటున్నదని, భారతీయ ఉత్పాదక రంగం గతకొద్ది నెలలుగా జోరును ప్రదర్శిస్తున్నదని మూడీస్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు