న్యూఢిల్లీ: ఇథనాల్ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు ఏడు బిలియన్ల డాలర్లు ఖర్చు చేయనున్నది. పెట్రోల్ దిగుమతి భారం తగ్గించుకోవడంతోపాటు పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించేందుకు 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడాలని ప్రధాని ఇటీవల పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఇంధనం కోసం ప్రతియేటా 10 బిలియన్ లీటర్ల ఇథనాల్ అవసరం అని, అందుకు 700 కోట్ల డాలర్లు అవసరం అని కేంద్ర చమురు మంత్రిత్వశాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ చెప్పారు.
ఇథనాల్ కలిపిన పెట్రోల్ కోసం న్యూ రిఫైనరీలు నిర్మించడానికి 500 బిలియన్ల డాలర్ల పెట్టుబడులు అవసరం. ఐదేండ్లలో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకంతో ఏటా 400 కోట్ల ప్రజాధనం ఆదా అవుతుంది.
ప్రస్తుతం దెబ్బతిన్న ఆహార ధాన్యాలు, అదనపు రైస్ను ఇథనాల్గా మారిస్తే సంప్రదాయేతర ఇంధనం వాడకాన్ని ప్రోత్సహించవచ్చు. దెబ్బతిన్న ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ తయారీకి అవసరమైన డిస్టిలేషన్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తామంటున్నది.
ప్రస్తుతం భారత్లో చక్కెర ఫ్యాక్టరీల్లో చెరుకు మొలాసిస్ నుంచి మాత్రమే ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. నాన్ షుగర్ మార్గాల్లో ఇథనాల్ ఉత్పత్తి వనరులు ప్రస్తుతం 10 శాతం లోపే. ఇక ముందు 50 శాతం షుగర్ బేస్డ్, మిగతా 50 శాతం ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ తయారీ దిశగా అడుగులు వేయొచ్చునని తరుణ్ కపూర్ చెప్పారు.