న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారతీయ కంపెనీలు దాచుకున్న సంపద 2020 నాటికి మూడు రెట్లు పెరిగింది. దాదాపు రూ.20.700 కోట్లు (2.55 బిలియన్ల స్విస్ ఫ్రాంక్స్) పెరిగింది. 2019 ముగిసే నాటికి ఇండియన్లు, ఇండియన్ కంపెనీలు దాచుకున్న సొమ్ము విలువ దాదాపు రూ.6,625 కోట్లు (899 మిలియన్ల స్విస్ ఫ్రాంక్స్).
బాండ్లు, ఇతర పథకాల్లో డిపాజిట్ చేసిన మొత్తం భారీగా పెరగడం దీనికి కారణం. కాగా, కస్టమర్ డిపాజిట్లు మాత్రం 2020లో పతనం అయ్యాయని గురువారం స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకు విడుదల చేసిన జాబితాలో తేలింది.
ఇదిలా ఉంటే అన్ని స్విస్ బ్యాంకుల్లో కస్టమర్ల డిపాజిట్లు 2020లో దాదాపు రెండు లక్షల కోట్ల స్విస్ ఫ్రాంక్స్లకు చేరాయి. ఇందులో విదేశీ ఖాతాదారుల డిపాజిట్లు 600 బిలియన్ డాలర్లు.
377 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్తో బ్రిటన్ ముందు నిలిచింది. ఇందులో 152 బిలియన్లలో అమెరికా రెండవ స్థానంలో నిలిచింది. 100 బిలియన్ ఫ్రాంక్స్ పైన నిలిచిన దేశాలు ఈ రెండే కావడం గమనార్హం. కాగా, 2020 చివరినాటికి స్విట్జర్లాండ్లో 243 బ్యాంకులు పనిచేస్తున్నాయి.