న్యూఢిల్లీ, జూన్ 17: కరోనా సంక్షోభంతో మందకొడిగా వున్న ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపర్చేందుకు జన్ధన్ ఖాతాల ద్వారా కుటుంబాలకు నగదు బదిలీచేయడంతో సహా రూ.3 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజి అవసరమని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కేంద్రానికి సూచించింది. కొవిడ్ సెకండ్వేవ్తో ప్రజలపై ఏర్పడిన ఒత్తిడిని తొలగించడానికి తగిన ఆర్థిక చర్యలు చేపట్టడం తక్షణ కర్తవ్యమని సీఐఐ అధ్యక్షుడు టీవీ నరేంద్రన్ గురువారంనాడిక్కడ మీడియాతో చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ వినియోగ ఆధారితమైనదని, కరోనాతో వినియోగ డిమాండ్ తగ్గినందున, ఇది పెంచేందుకు నగదు బదిలీతో సహా పలు చర్యల్ని తీసుకోవాల్సివుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
టాటా స్టీల్ ఎండీ నరేంద్రన్ ఇంకా ఏమన్నారంటే&