Benz support to Tesla | అమెరికా, పాశ్చాత్య దేశాలతో పోలిస్తే దిగుమతి చేసుకున్న కార్లకు భారతీయులు రెట్టింపు చెల్లించాల్సి వస్తోందని లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ పేర్కొంది. భారత్లో దిగుమతి చేసుకున్న కార్లపై సుంకాలు దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. దిగుమతి చేసుకున్న కార్లపై భారత ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపింది. అధిక సుంకాల వల్ల కార్ల కొనుగోలుదారులపై రెట్టింపు భారం పడుతుందని మెర్సిడెజ్ బెంజ్ ఎండీ మార్టిన్ స్కెవెంక్ వ్యాఖ్యానించారు.
ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఉన్న దిగుమతి సుంకాలను తగ్గించాలని ఇంతకుముందు ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్మస్క్.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. చాలా ఎక్కువగా ఉన్న దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా మార్కెట్కు చేయూతనివ్వాలని మార్టిన్ స్కెవెంక్ అభిప్రాయ పడ్డారు.
అత్యంత భారీగా ఉన్న దిగుమతి సుంకంతో కస్టమర్లను ఆకర్షించలేకపోతున్నామని, భారత్లో తక్కువ కార్లు అమ్ముడు పోతున్నామని మార్టిన్ స్కెవెంక్ చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్తో సహా అన్ని రకాల నూతన టెక్నాలజీలను భారత్కు తీసుకు రావడం సాధ్యం కాదన్నారు .
దిగుమతి చేసుకున్న కార్లపై సుంకాలు తగ్గించాలన్న టెస్లా అభ్యర్థనకు మార్టిన్ స్కెవెంక్ మద్దతు పలికారు. కేవలం ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే పరిమితం కాకుండా, అన్ని రకాల హై టెక్నాలజీ లగ్జరీ కార్లపైనా సుంకాలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
కర్బన ఉద్గారాల్లేకుండా అందుబాటులోకి తీసుకువస్తున్న విద్యుత్ కార్లపై దిగుమతి సుంకం 110 శాతం ఉండటంతో కస్టమ్స్ సుంకం విలువ 40 వేల డాలర్లు ఎక్కువగా ఉందని టెస్లా ఇంతకుముందు పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలపై సుంకాలను 40 శాతానికి కుదించి, సోషల్ వెల్ఫేర్ సర్చార్జీ 10 శాతం తొలగించాలని టెస్లా అభ్యర్థించింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఉద్దేశపూర్వకంగా నాపై దుష్ప్రచారం.. రేవంత్పై కోర్టులో కేటీఆర్ పిటిషన్
#RahulDrugTest: రాహుల్ డ్రగ్టెస్ట్.. ట్విట్టర్లో ట్రెండింగ్
Stock markets: భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు
న్యూ డుకాటి మాన్స్టర్ బుకింగ్స్ షురూ : ధర ఎంతంటే..!