Indian Aviation | కరోనా మహమ్మారితో దేశీయ విమానయానం కుదేలైంది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఏవియేషన్ సెక్టార్లో ఎయిరిండియా-టాటా డీల్, బుల్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ఝున్వాలా సారధ్యంలోని ఆకాశ ఎయిర్ ఎంట్రీకి సిద్ధం అవుతున్నాయి. టాటా సన్స్ సారథ్యంలో ఎయిరిండియా, ఝున్ఝున్వాలా ఆకాశ ఎయిర్కు గట్టి పోటీ ఎదురు కానున్నది. టాటా సన్స్ సారధ్యంలోకి రానున్న ఎయిరిండియాకు ఏవియేషన్ అసెట్స్ ఉన్నా.. ఇప్పటికే ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఇండిగో ఇప్పటివరకు భారత గగనతలంపై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.
ఇండిగో ఎయిర్లైన్స్ 275 విమానాలు నడుపుతున్నది. దేశీయ ఏవియేషన్ మార్కెట్లో ఇండిగో వాటా 58 శాతం. కరోనా మహమ్మారికి ముందు దేశీయంగా 70 కేంద్రాలు, 24 అంతర్జాతీయ కేంద్రాలకు విమాన సేవలందించింది. ఇండిగో సేవల్లో ఎయిర్బస్ విమానం కూడా ఉంది.
ఎయిరిండియా-టాటాకు దేశీయ విమాన సర్వీసుల మార్కెట్ వాటా 25 శాతం పైమాటే. ఈ సంస్థకు 215కు పైగా విమానాలు ఉన్నాయి. దేశీయంగా 100 కేంద్రాలు, అంతర్జాతీయంగా 60 కేంద్రాల మధ్య సేవలందిస్తున్నది. వైడ్ అండ్ నారో (narrow) బాడీ విమానాలు ఎయిరిండియా సొంతం.
చౌక విమానయానానికి పెట్టింది పేరు ఇండిగో. ఇతర ప్రాంతాల్లోని రూట్లకు విస్తరణ. దేశీయ మార్కెట్లో భారీ వాటాను కాపాడుకునే సత్తా దీని సొంతం. ప్రతి 10 మంది ప్రయాణికుల్లో ఆరుగురు ఇండిగో విమానాల్లోనే ప్రయాణిస్తుంటారు. ప్రతిరోజూ 1200 విమాన సర్వీసులు ఆపరేట్ చేస్తున్నది. ప్రతి నెలా ఐదు విమానాలను తన సర్వీసుల్లో కొత్తగా చేరుస్తున్నది.
ఎయిరిండియా-టాటా సంస్థకు 117 వైడ్ బాడీ, నారోబాడీ విమానాలు, 24 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు ఉన్నాయి. శిక్షణ పొందిన సిబ్బంది, అమూల్యమైన ఎయిర్పోర్ట్ స్లాట్లు, అత్యుత్తమ నిర్వహణ ప్రమాణాలు, అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్ తదితర అంశాలు ఎయిరిండియా సొంతం.
కరోనాకు ముందు దేశీయ ఎయిర్లైన్ మార్కెట్లో కొన్నేండ్లుగా ఇండిగో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. తద్వాదా గణనీయ లాభాలు గడిస్తున్న ఏకైక విమానయాన సంస్థగా పేరొందిందని నిపుణులు చెబుతున్నారు. విభిన్న వైద్య సేవలందించగల ఎయిరిండియాతో టాటా గ్రూప్కు లబ్ధి చేకూరనున్నది. వ్యయ నియంత్రణతో ఆపరేషన్లను కట్టుదిట్టం చేయడం చాలా ముఖ్యం అని అంటున్నారు. మూడు విమానయాన సంస్థలతో కలిసి వ్యూహాత్మక విధానంతో రెగ్యులర్ బిజినెస్ ట్రావెల్తో ప్రీ-కరోనా స్థాయికి దూసుకెళ్లే సామర్థ్యం టాటా గ్రూప్ సంతరించుకుంటుందని పేర్కొంటున్నారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
సూడాన్లో సైనిక తిరుగుబాటు, దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఏడుగురు మృతి
మీ ఎజెండాతో పార్టీకి నష్టం కలిగించకండి: సోనియాగాంధీ
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
గాయాల గురించి చెప్పే స్మార్ట్ బ్యాండేజ్ వచ్చేసింది..!
హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలివే..!
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!