కడ్తాల్, మార్చి 26 : పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన వరికుప్పల జంగయ్యకు రూ.60 వేలు, కర్కల్పహాడ్ గ్రామానికి చెందిన లావణ్యకు రూ.30 వేలు సీఎం సహాయ నిధి నుంచి మంజూరయ్యాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంలా మారిందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గూడూరు శ్రీనివాస్రెడ్డి, నాయకులు సురేందర్రెడ్డి, అశోక్గౌడ్, శ్రీనివాస్, సైదులు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ఇబ్రహీంపట్నం, మార్చి 26 : ఆపదలో ఉన్న ప్రతిఒక్కరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన ఇర్కుల యాదయ్యకు రూ.60వేలు, మక్కపల్లి శేఖర్కు రూ.38వేలు, ఉడుతల శ్రీకాంత్కు రూ.30వేల మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎలాంటి ఆరోగ్య సమస్యలతోనైనా ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించుకున్నా సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకుని లబ్ధిపొందాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి బాష, ఎంపీటీసీ శివలీల, సహకార సంఘం డైరెక్టర్ మక్కపల్లి స్వరూప పాల్గొన్నారు.