ఇన్వెస్ట్మెంట్ అంటేనే రిస్క్తో కూడుకున్న పని. సంప్రదాయ స్థిరాదాయ పథకాలపై రాబడి తగ్గిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మదు పు మార్గాలపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. కాస్త రిస్క్ ఉన్నాసరే, రాబడి అధికంగా ఇచ్చే సాధనాల కోసం అన్వేషిస్తున్నారు. గతంలో అధిక రాబడులు, అధిక లిక్విడిటీ, తక్కువ లావాదేవీ చార్జీల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త సాధనాల అన్వేషణ కొనసాగుతున్నది. ఈక్విటీల్లో మదుపు దీర్ఘకాలంలో అధిక రాబడులను ఇచ్చేదే అయినా.. రిస్క్, ఒడిదుడుకులు అధికంగా ఉన్న కారణంగా నేరుగా ఈక్విటీల్లో మదుపు చేయడానికి చాలా మంది ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం లేదు. అయితే సులభంగా అర్థమవడంతోపాటు, ఇండెక్స్లోని షేర్లలో వాటికిచ్చిన వెయిటేజీ ఆధారంగా మదుపు చేయడంతో ఇండెక్స్ ఫండ్లపై ఈ మధ్య ఆసక్తి పెరిగింది. ఇండెక్స్లోని షేర్లలోనే మదుపు చేసే ఫండ్ కనుక ఫండమెంటల్గా పటిష్టంగా ఉన్న షేర్లలోనే మదుపు ఉంటుంది. ఇండెక్స్ కన్నా అధిక రాబడిని ఇచ్చిన చరిత్ర ఈ ఫండ్స్కు ఉంది. అలా కాకుండా ఇండెక్స్ కన్నా తక్కువ రాబడి ఇస్తే దాన్ని ట్రాకింగ్ ఎర్రర్ అంటారు. ఇండెక్స్ ఫండ్ల కొనుగోలు, అమ్మకాలపై వ్యయాలు తక్కువే.
మ్యూచువల్ ఫండ్ల రీకేటగిరైజేషన్, బెంచ్మార్కింగ్ పద్ధతులను మార్చడంతో ప్రారంభంలో మ్యూచువల్ ఫండ్ల రాబడులు గణనీయంగా తగ్గిపోయినా.. గతేడాది కాలంగా అన్ని రకాల ఫండ్లతోపాటు ఇండెక్స్ ఫండ్లలో కూడా రాబడులు ఇబ్బడిముబ్బడిగానే ఉన్నాయి.
అనుకూలాంశాలు