మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు ఎనిమిది నెలల విరామం తర్వాత పెరిగాయి. స్టాక్ మార్కెట్ గరిష్ఠ స్థాయిల్లో ఉండడంతోపాటు గత రెండు నెలలుగా స్థిరీకరణ జరుగుతుండడంతో ఈక్విటీ పెట్టుబడి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో మరోసారి ఎస్ఐపీలు, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ల వైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. గతేడాది కాలంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు రూ. 22.26 లక్షల కోట్ల నుంచి రూ.31.43 లక్షల కోట్లకు చేరుకున్నాయి. పెట్టుబడులు ఇంతగా పెరగడానికి ప్రధానంగా ఈక్విటీ మార్కెట్ 70 శాతంపైగా రాబడులు ఇవ్వడమేనని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఆంపీ) తెలిపింది. ఇందులో ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్ల వాటా 30.54 శాతం అవగా, ఆర్బిట్రేజ్ ఫండ్లుసహా హైబ్రిడ్ ఫండ్ల వాటా 10.95 శాతం. గత మూడు నెలల్లో డెట్ ఫండ్ల నుంచి భారీగా నిధులను నికరంగా ఉపసంహరించుకున్నారు. జనవరిలో రూ.33,409 కోట్లను విరమించుకోగా, మార్చిలో అయితే ఏకంగా రూ.52,528 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారు. జనవరిలో కేవలం రూ.1,735 కోట్ల పెట్టుబడులే వచ్చాయి. అయితే అన్ని రకాల మ్యూచువల్ ఫండ్లలో మార్చి నెలలో రూ.46,790 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రధానంగా సంవత్సరాంతం కనుక ఈఎల్ఎస్ఎస్ స్కీముల్లోనూ, ఎస్ఐపీలు పెరిగినందున ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చి పడ్డాయి. మార్చి నెలలో ఎస్ఐపీల ద్వారా రూ.9,182 కోట్లను ఇన్వెస్టర్లు మదుపు చేశారు. మొత్తం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో ఎస్ఐపీల వాటా 38 శాతం. ఫిబ్రవరి నెలలో పెట్టుబడులు రూ.7,528 కోట్లు మాత్రమే.
ఇంటిని కొనుగోలు చేసేందుకు ముందస్తుగా చెల్లించే మార్జిన్ మనీ ఎంత ఉందో చూసుకోండి. సాధారణంగా బ్యాంకులు ఇంటి విలువలో 90 శాతం వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నా మన దగ్గర మార్జిన్ మనీ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఇంటి ధర మోతాదులో ఉంటే ఫర్వాలేదు కానీ, ధర కాస్త ఎక్కువైతే మాత్రం 75 శాతం వరకు రుణాన్ని అందిస్తున్నాయి. అలాగే రిజిస్ట్రేషన్, ఇంటీరియర్ డెకరేషన్ ఇవన్నీ హోమ్లోన్ పరిధిలోకి రావు. హోమ్లోన్ తీసుకునే వారి వయస్సు, క్రెడిట్ స్కోర్, రుణ మొత్తం, లోన్ వాల్యూ రేషియో వంటి అంశాలను బట్టి మీకు ఎంత రుణం ఎంత వడ్డీతో వస్తుందో తెలుస్తుంది.