శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి గత నెలలో 4 లక్షల ప్రయాణీకుల రాకపోకలు
శంషాబాద్, జూలై 5: విమాన ప్రయాణాలు ఊపందుకున్నాయి. వేగంగా వ్యాక్సినేషన్, లాక్డౌన్ ఎత్తివేతలు.. ప్రయాణీకులలో ధైర్యం నింపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత నెలలో జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు విమానాల రాకపోకలు పెరిగాయి. ఆరంభంలో 100 ఉండగా, మాసాంతానికి 199కి చేరినట్లు విమానాశ్రయ వర్గాలు సోమవారం ఓ ప్రకటనలో తెలిపాయి. అలాగే ప్రయాణీకుల సంఖ్య 10 వేల నుంచి 4 లక్షలకు పెరిగిందని, అంతర్జాతీయ ప్యాసింజర్లు 35 వేలుగా నమోదయ్యారని పేర్కొన్నాయి.