న్యూఢిల్లీ : ఆదాయపన్ను శాఖ 22.61 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు రూ 47,318 కోట్లకు పైగా ఐటీ రిఫండ్ను జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్ట్ 9 మధ్య ఈ మొత్తాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) జారీ చేసిందని ఆదాయ పన్ను శాఖ శనివారం వెల్లడించింది.
వీటిలో రూ 14,241 కోట్లు ఐటీ రిఫండ్స్ కాగా, రూ 33,078 కోట్లు కార్పొరేట్ ట్యాక్స్ రిఫండ్స్ అని ఆదాయ పన్ను శాఖ అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. 2020-21లో రిటన్స్ దాఖలు చేసే సమయంలో సాఫ్ట్వేర్ ఎర్రర్ కారణంగా పన్ను చెల్లింపుదారులు చెల్లించిన అదనపు వడ్డీ, ఆలస్య రుసుంను ఐటీ శాఖ రిఫండ్ చేస్తుందని ట్వీట్లో పేర్కొంది. సాఫ్ట్వేర్ లోటుపాట్లను సవరించామని, మరోసారి ఈ సమస్య ఎదురుకాదని తెలిపింది.