లండన్: ఆర్థిక అనిశ్చితిలో ప్రత్యేకించి గతేడాది కరోనా స్వైర విహారం చేస్తున్నప్పటి నుంచి ఇటు డాలర్.. అటు బంగారానికి ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా అవతరించిన డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్ పతనం దిశగా అడుగులేస్తున్నది.
ఆల్టైం రికార్డులు నెలకొల్పిన బిట్ కాయిన్ విలువ మంగళవారం ఉదయం 7.59 గంటలకు 53,705.54 డాలర్లకు పడిపోయిందని కాయిన్ టెక్ తెలిపింది. మన కరెన్సీలో దీని విలువ 40.15 లక్షలు.
గతవారం బిట్ కాయిన్ ఆల్ టైమ్ రికార్డు 64,829.14 డాలర్లు (రూ.48.46 లక్షలు) పలికింది. అంటే బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.8 లక్షల వరకు నష్టపోయింది.
గత ఐదు సెషన్లలోనే అత్యంత పాపులర్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ విలువ రూ.6 లక్షల పై చిలుకు నష్టపోయింది. తిరిగి మధ్యాహ్నం 11.20 గంటలకు బిట్ కాయిన్ 54.978.74 డాలర్లు (రూ.41.10 లక్షలు)గా రికార్డైంది.
ఇంతకుముందు బిట్ కాయిన్ను ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ మోడ్గా ప్రకటించారు చైనా సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ లీబో.. ఈ ప్రకటనపై చైనా యూ టర్న్ తీసుకుంది. దీనికి ఆయిల్ను ప్రత్యామ్నాయ పెట్టుబడిగా ప్రకటించింది.
చైనా ప్రకటనతోనే బిట్ కాయిన్ పట్ల ఇన్వెస్టర్లలో సెంట్మెంట్ దెబ్బ తిన్నదని తెలుస్తున్నది. బిట్ కాయిన్ సహా ఇతర క్రిప్టో కరెన్సీలపై అనిశ్చితి కొనసాగుతుండటమే దీనికి కారణమని సమాచారం.
చట్ట విరుద్ధ కార్యక్రమాలకు వాడుతున్నారన్న వార్తల నేపథ్యంలో దాని వినియోగంపై అమెరికా ఆంక్షలు విధించింది. క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయడంపై టర్కీ నిషేధం విధించడం వంటి కారణాలతో బిట్ కాయిన్తోపాటు ఇతర క్రిప్టో కరెన్సీలు నష్టపోయాయి.
మంగళవారం ట్రేడింగ్లో 24 గంటల కనిష్టం 53,705.54 డాలర్లకు పడిపోయి.. గరిష్ఠంగా 57.609.37 (రూ.43.07 లక్షల) డాలర్లకు చేరింది. బిట్ కాయిన్తోపాటు ఇతర క్రిప్టో కరెన్సీలు ఎథిరియం, ఎక్స్ఆర్పీ, స్టెల్లార్ వంటి వాటి విలువ కూడా పడిపోయింది.
మంగళవారం మధ్యాహ్నం 11.51 గంటలకు ఎథిరియం విలువ 2,123.13 డాలర్లు, ఎక్స్ఆర్పీ 1.28 డాలర్లు, స్టెల్లార్ 0.488306 డాలర్ల వద్ద నిలిచాయి. కేవలం డోగ్కాయిన్ లాభపడింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
రష్యా నుంచి వైదొలిగిన అమెరికా రాయబారి
వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోండి: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
కరోనా ఎఫెక్ట్ : ఆక్సిజన్ కోసం రెండు రాష్ట్రాల తగువులాట..!
పిచ్బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్లో లాక్డౌన్కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు