వాషింగ్టన్, జూలై 27: భారత వృద్ధి అంచనాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు వృద్ధి అంచనాల్లో కోత విధిస్తుండగా..తాజాగా ఈ జాబితాలోకి అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) కూడా చేరిం ది. వచ్చే మా ర్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారత్ 9.5 శాతం వృద్ధిని మాత్రమే సాధించనున్నదని పేర్కొం ది. 12.5 శాతంగా ఉంటుందని కరోనా సెకండ్ వేవ్ రాకముందు ఏప్రిల్లో అంచనావేసిన విషయం తెలిసిందే. కానీ, వచ్చే ఏడాది వృద్ధి అంచనాను 8.5 శాతానికి పెంచడం గమనార్హం. గతంలో 6.9 శాతంగా ఉంటుందని పేర్కొన్నది. మార్చి నుంచి మే మధ్యకాలంలో భారత్లో సెకండ్ వేవ్ ఉదృతమవడంతో దేశ ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపిందని, దీంతో వృద్ధి అంచనాల్లో కోత విధించింది.