హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. లాక్డౌన్ విధించడం వల్ల ప్రజాజీవనం స్తంభించడంతోపాటు రాష్ట్ర ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత అనుభవాలతోపాటు, ఇతర రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్కు వచ్చారు. వచ్చిన వెంటనే రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమావేశాన్నినిర్వహించి, కూలంకషంగా సమీక్షించారు. ప్రస్తుతం ఎంతవరకు ఆక్సిజన్ అందుతున్నది? ఇంకా ఎంతకావాలి? వ్యాక్సిన్లు ఎంతమేరకు అందుబాటులో ఉన్నాయి? రోజుకు ఎంత అవసరం? రెమ్డెసివిర్ మందు ఏ మేరకు సరఫరా అవుతున్నది? రాష్ట్రావసరాలకు రోజుకు ఎన్ని కావాలి? అనే విషయాలతోపాటు ఆక్సిజన్ బెడ్ల లభ్యత తదితరాలపై పూర్తిస్థాయిలో చర్చించారు. రెమ్డెసివిర్ తయారీ సంస్థలతో ఫోన్లో మాట్లాడిన సీఎం.. వాటి లభ్యతను మరింత పెంచాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యూనిటీ హాస్పిటల్స్, ఏరియా దవాఖానల్లో మొత్తం 5,980 కొవిడ్ అవుట్ పేషెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని, వీటి సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.
లాక్డౌన్ ఎందుకు వద్దంటే..
రాష్ట్రంలో లాక్డౌన్ ఎందుకు విధించకూడదనే విషయంలో సీఎం కేసీఆర్ లోతైన విశ్లేషణచేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘లాక్డౌన్ వల్ల ఉపయోగంలేదు. తెలంగాణ.. ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్. కనుక ఇకడ 25 నుంచి 30 లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి పనిచేస్తున్నారు. కరోనా మెదటివేవ్ సమయంలో లాక్డౌన్ విధిస్తే వీరందరి జీవితాలు చెల్లాచెదురైన పరిస్థితిని చూశాం. వీరంతా వెళ్లిపోతే తిరిగి రావడం కష్టం. అదే సమయంలో రాష్ట్రంలో ధాన్యం పుషలంగా పండింది. తెలంగాణవ్యాప్తంగా గ్రామాల్లో 6,144 వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిండి ఉన్నది. ప్రస్తుతం అకడ వడ్ల కాంటా నడుస్తున్నది. వరి కొనుగోలు అంటే ఆషామాషీ కాదు. దీనిలో కిందినుంచి మీది దాక చైన్ సిస్టం ఇమిడి ఉంటది. ఐకేపీ కేంద్రాల బాధ్యులు, హమాలీలు, తూకం వేసేందుకు కాంటా పెట్టేవాళ్లు, మిల్లులకు తరలించే కూలీలు, లారీలు, ట్రాన్స్పోర్ట్ట్ వెహికిల్స్ మిల్లులకు చేరవేయడం, అకడ దించడం, మళ్లీ అకడినుంచి ఎఫ్సీఐ గోడౌన్లకు తరలించడం, మళ్లీ అకడ దించడం, స్టాక్ చేయడం, తిరిగి వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయడం.. ఇంత వ్యవహారం ఉంటది. ఈ మెత్తం వ్యవహారంలో లక్షలమంది భాగస్వాములవుతారు.
వివిధ రాష్ట్రాలనుంచి వచ్చి రైస్మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు ఏమౌతారు? లాక్డౌన్ విధిస్తే ఇంతమంది ఎకడపోతారు? కార్మికులు చెల్లాచెదురైపోతే తిరిగి వారిని రప్పించడం ఎట్లా? కొనుగోలు చేయకపోతే పండించిన వరి ధాన్యాన్ని రైతు ఎకడ పెట్టుకుంటాడు? మెత్తం ధాన్యం కొనుగోలు వ్యవస్థ ఎకడికకడ స్తంభించిపోయే ప్రమాదమున్నది. తద్వారా సంభవించే సంక్షోభం ఘోరంగా ఉండే ప్రమాదం ఉన్నది. అదే సమయంలో నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలు, పండ్లు, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులు, ప్రసవాలు, పారిశుద్ధ్యం వంటి అత్యవసర కార్యక్రమాలను ఆపివేయలేం. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాక్సిన్లు, మెడిసిన్లు, ఆక్సిజన్తోపాటు ఇతర నిత్యావసరాలను సరఫరా చేసుకుంటున్నం. ఒకవేళ లాక్డౌన్ విధిస్తే వీటన్నిటికీ ఆటంకం ఏర్పడుతది. ఇన్ని కారణాల వల్ల ప్రభుత్వమే ఒక భయానక పరిస్థితిని సృష్టించినట్లవుతుంది. అందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు, కాబట్టి లాక్డౌన్ విధించలేం’ అని వివరించారు.
పరిశ్రమలు మూతపడితే అంతా ఆగమాగం
‘పరిశ్రమలు ఉన్నపళంగా మూతపడితే అంతా ఆగమాగం కాదా? క్యాబ్, ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏమిటి? కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి తలెత్తి మొత్తం వ్యవస్థ కుప్పకూలే ప్రమాదమున్నది. కరోనా ఏమోగానీ ఆకలి సంక్షోభం తలెత్తే ప్రమాదమున్నది. గొంతు పిసికినట్టు చేస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నది. కాబట్టి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, లాక్డౌన్ విధించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది’ అని సీఎం తెలిపారు.
మరో 5 వేల ఆక్సిజన్ బెడ్లు పెంచండి
హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వ దవాఖానల్లో 9500 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయని, వారంలో మరో 5000 పడకలు పెంచాలని ఆదేశించారు. మెరుగైన ఆక్సిజన్ సరఫరాకోసం ఒకొక్కటి కోటి రూపాయల చొప్పున 12 క్రయోజెనిక్ ట్యంకర్లను చైనా నుంచి వాయుమార్గంలో అత్యవసరంగా దిగుమతిచేయాలని సీఎస్ను ఆదేశించారు. ఇందుకోసం అత్యంత వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆక్సిజన్ లభ్యత పెంచుదాం
ఆక్సిజన్ సరఫరాపై సమీక్షించిన సీఎం.. రాష్ట్రంలో ఆక్సిజన్ లభ్యతను పెంచేందుకు పలు ప్రయత్నాలు చేశారు. సమావేశం నుంచే ఐఐసీటీ డైరక్టర్ చంద్రశేఖర్తో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే ఆక్సిజన్ నిల్వలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. వారి సూచనల మేరకు తక్షణమే 500 ఆక్సిజన్ ఎన్రిచర్లను కొనుగోలు చేయాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. త్వరలో మరిన్ని సమకూర్చాలని, తకువ సమయంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే వ్యవస్థలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం సూచించారు.
నిధుల విడుదలకు ప్రత్యేకాధికారి
సెకండ్వేవ్లో ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో కలిపి 1.56 లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా అందులో 1.35 లక్షల మంది (85%) కోలుకున్నారని అధికారులు సీఎంకు వివరించారు. కరోనా పరిస్థితిపై వైద్యాధికారులు ప్రతిరోజూ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి, వివరాలను వెల్లడించాలని సీఎం చెప్పారు. దీనికి డైరక్టర్ ఆఫ్ హెల్త్ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. పాజిటివ్ కేసులు, కోలుకున్న వారి వివరాలు, హోం క్వారంటైన్లో ఎంతమంది ఉన్నారు? ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఎంతమంది చికిత్స పొందుతున్నారు? అనే వివరాలను పబ్లిక్ డొమైన్లో ప్రదర్శించాలని ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. వైద్యశాఖకు అవసరమైన నిధులను వెంటవెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. ఈ నిధుల విడుదలకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.
రెండో డోస్కు ప్రాధాన్యం ఇవ్వండి
మొదటి డోస్ వాక్సిన్ వేసుకున్నవాళ్లకు వారి నిర్ణీత సమయాన్ని అనుసరించి రెండో డోస్ వేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు గ్రామాలు పట్టణాల్లో సోడియం హైపోక్లోరైట్ను పిచికారీ చేయించి, పరిసరాల పరిశుభ్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలని కోరారు.
కరోనా నియంత్రణకు ప్రజలు స్వచ్ఛందంగా పూనుకోవాలి
కేసులు ఎకువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటిని మైక్రోలెవల్ కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి కరోనా నిరోధక చర్యలను తక్షణమే చేపడుతామని సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనా నియంత్రణ కోసం ప్రజలు కూడా పూనుకోవాలని, ప్రతి వ్యక్తి స్వచ్ఛందంగా కరోనాపై యుద్ధంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమిష్టిగా అందరం కలిసి కొట్లాడితేనే కరోనా అంతమవుతుందని అన్నారు. మేధావులు, బుద్ధిజీవులు ఈ దిశగా ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు.
ప్రజలకు ఇంటికే కొవిడ్ మెడికల్ కిట్లు
కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఎవరికైనా ఏ మాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే కొవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలని చెప్పారు. ఆశ వరర్లు, ఏఎన్ఎంల ద్వారా మెడికల్ కిట్లను ఇంటింటికీ అందజేస్తామన్నారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతోపాటు మందులు అందజేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి భూపాల్రెడ్డి, సీఎంవో అధికారి, కరోనా ప్రత్యేక పర్యవేక్షణాధికారి రాజశేఖర్రెడ్డి, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, హైల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి, కరుణాకర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది కృషి, త్యాగం గొప్పవి
కరోనా నియంత్రణలో ప్రాణాలకు తెగించి పాటుపడుతున్న వైద్యారోగ్యశాఖను అభినందించారు. వైద్యులు, నర్సులు, ఆశ వరర్లు, ఏఎన్ఎం తదితర వైద్య సిబ్బంది గొప్పసేవ చేస్తున్నారని ప్రశంసించారు. వారి కృషి, త్యాగం గొప్పదని కొనియాడారు. రెండోవేవ్ తీవ్రత మే 15 తర్వాత తగ్గిపోతుందని రిపోర్టులు సూచిస్తున్నాయన్నారు. వ్యాధి నిరోధానికి ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలే స్వీయనియంత్రణ పాటించాలన్నారు. గుంపులు గుంపులుగా తిరగొద్దని, పెండ్లిళ్లలో వందకు మించి జమ కావద్దని కోరారు. పరిశుభ్రత పాటించాలని శానిటైజర్లు వాడాలని, మాసులు ధరించాలని, భౌతికదూరాన్ని పాటించాలని తెలిపారు. ఇటువంటి జాగ్రత్తలే శ్రీరామ రక్ష అన్నారు.
ప్రజలకు భయాందోళన వద్దు..
కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావద్దు. ఎవరికైనా ఏ మాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే కొవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలి. ఆశ వరర్లు, ఏఎన్ఎంల ద్వారా మెడికల్ కిట్లను ఇంటింటికీ అందజేస్తాం. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతోపాటు మందులు ఉంటాయి.
మొదటి డోస్ వేసుకున్నోళ్లకే ప్రాధాన్యం
మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లకు వారి నిర్ణీత సమయాన్ని అనుసరించి రెండో డోస్ వేసేందుకు వైద్యశాఖ అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలి. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు గ్రామాలు పట్టణాల్లో సోడియం హైపోక్లోరైట్ను పిచికారీ చేయించి, పరిసరాల పరిశుభ్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలి.
-ముఖ్యమంత్రి కేసీఆర్