న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశీ విమానయాన పరిశ్రమ నష్టాలు ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.26,000 కోట్లకు చేరవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనాల్ని ప్రకటించింది. అలాగే ఈ పరిశ్రమ రుణ భారం రూ.1.2 లక్షల కోట్లకు పెరగవచ్చని హెచ్చరించింది. పైగా ఈ పరిశ్రమకు 2022-2024 మధ్యకాలంలో రూ.45,000-47,000 కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని ఇక్రా పేర్కొంది.డిమాండ్ తగ్గడం, జెట్ ఇంధన ధరలు పెరగడంతో ఏర్పడిన లిక్విడిటీ సంక్షోభాన్ని తట్టుకునేందుకు విమానయాన కంపెనీలు నిధుల సేకరణ ప్రణాళికల్ని చేపడుతున్నాయని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ప్రయాణీకుల ట్రాఫిక్ 45-50 శాతం, అంతర్జాతీయ ట్రాఫిక్ 80-85 శాతం వృద్ధిచెందవచ్చని ఇక్రా
అంచనావేసింది.