ముంబై, జూలై 24: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన ఐసీఐసీఐ బ్యాంక్ సంతృప్తికరమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ.4,747.42 కోట్లుగా నమోదైంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే ఇది 52 శాతం అధికం. ఏడాది క్రితం రూ.26,067 కోట్లుగా ఉన్న ఆదాయం.. ఈ క్యూ1లో రూ.24,379 కోట్లకు తగ్గింది. మొండి బకాయిలకు కేటాయింపులు మూడోవంతుకు తగ్గాయి. గతంలో రూ.7,594 కోట్ల కేటాయింపులు జరుపగా, ఈసారి రూ.2,852 కోట్లకు తగ్గాయి.