నూరు చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఇప్పుడు తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఇన్నాళ్లు ఆఫ్ స్క్రీన్లోనే ఉన్న రాఘవేంద్ర రావు ఇప్పుడు ఆన్స్క్రీన్లోను కనిపించి సందడి చేయనున్నాడట. రచయిత, నటుడు తనికెళ్ల భరణి .. రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తి చేశారు.
తనికెళ్ల భరణి తెరకెక్కించనున్న ఈ చిత్రంలో రాఘవేంద్ర రావు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నారు. ఆయన భార్య పాత్రలో సీనియర్ నటి లక్ష్మీ కనిపిస్తారని టాక్. అలానే అందాల ముద్దుగుమ్మ శ్రియ కూడా చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. లాక్డౌన్ తర్వాత ఈ చిత్ర షూటింగ్ మొదలు కానున్నట్టు తెలుస్తుంది. కాగా, రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు హీరోగా పెళ్లి సందడి చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.