నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 3: ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పుట్టిన రోజును పురస్కరించుకొని గురువారం సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లా ల్లో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలో నిరాడంబరంగా వేడుకలు జరిపా రు. రోగులకు పండ్లు, ఆశ కార్యకర్తలు, పేదలకు సరుకులు పంపిణీ చేశారు. పలుచోట్ల మొక్కలు నాటారు. ఆలయాల్లో మంత్రి పేరిట పూజలు చేశారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి సొంత ఖర్చుతో 800మందికి ఉచితంగా కొవిడ్ వ్యాక్సి న్ వేయించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ ఎల్లమ్మ దేవాలయంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి, జగదేవ్పూర్ పీహెచ్సీ పరిధిలోని ఆశవర్కర్లకు సరుకులు అందజేశారు. సంగారెడ్డిలోని 6వ వార్డులో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కౌన్సిలర్ సోహైల్ అలీ ఆధ్వర్యంలో పేదలు, ఆటో డ్రైవర్లు, రోజు కూలీలకు వస్తువులు పంపిణీ చేశారు. సిద్దిపేటలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
సిద్దిపేటకు చెందిన అనాథ బాలిక భాగ్యను గతంలో చేరదీసి బాలసదన్లో చదివించడంతోపాటు పెండ్లి చేయించిన మంత్రి హరీశ్.. తన పుట్టినరోజు సందర్భంగా ఆమె కు కేసీఆర్నగర్లో డబుల్ బెడ్రూం ఇల్లు అందజేశారు.