చెన్నై: దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ ఇండియా దేశీయంగా కార్ల ఉత్పత్తిలో బుధవారం కీలక మైలురాయిని దాటింది. తమిళనాడులోని హ్యుండాయ్ ప్రొడక్షన్ యూనిట్లో ఈ మైలురాయిని దాటింది. 25 ఏండ్ల క్రితం చిన్న కారు శాంత్రో తొలి మొడల్గా దేశీయ మార్కెట్లో అడుగు పెడుతుంది.
తాజా లేటెస్ట్ మోడల్ కారు అల్కాజార్ పదవ మిలియన్ల కారును ఉత్పత్తి చేసింది. ఈ సంస్థ కీలక మైలురాయిని దాటిన సందర్భంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. కార్ల ఉత్పాదక యూనిట్లో ఓ కారు బాయ్నెట్పై సంతకం చేశారు.
మేకిన్ ఇండియా ఇన్షియేటివ్కు హ్యుండాయ్ కట్టుబడి ఉందని హ్యుండాయ్ మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈవో ఎస్ఎస్ కిమ్ చెప్పారు. చారిత్రకంగా 10వ మిలియన్ కారును ఉత్పత్తి చేయడం దానికి నిదర్శనం అని పేర్కొన్నారు.
భారత్ నుంచి విదేశాలకు కార్లను ఎగుమతి చేస్తున్న సంస్థల్లో హ్యుండాయ్ ఒకటి. 2020 ప్రారంభంలోనే 30 లక్షల కార్లను ఎగుమతి చేసిన మార్క్కు చేరుకున్నది. 88 దేశాలకు కార్లను హ్యుండాయ్ ఎగుమతి చేస్తున్నది.
2008 మార్చి నాటికి ఐదు లక్షలకు, 2010 ఫిబ్రవరి నాటికి 10 లక్షలకు, 2014 మార్చి నాటికి 20 లక్షలకు చేరుకున్నది. గతేడాది 1,04,342 యూనిట్లను ఎగుమతి చేసింది.