హైదరాబాద్, సిటీబ్యూరో, అక్టోబర్ 20: హైదరాబాద్ నుంచి విమానయాన గమ్యస్థానాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విస్తరణ ప్రణాళిక శరవేగంగా అమలు జరుగుతున్నది. ఈ ప్రణాళికలో భాగంగా టర్మినల్, ఎయిర్సైడ్ ప్రాంతాల్ని అభివృద్ధిపరుస్తున్నారు. ఈ విమానాశ్రయ నిర్వహణా సంస్థ జీఎమ్మార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎక్కువ విమానాల్ని నిలిపిఉంచేందుకు మరిన్ని ఎయిర్క్రాఫ్ట్ స్టాండ్ల్ని, విమానరాకపోకలకు మరిన్ని రన్వేలను నిర్మిస్తున్నట్లు తెలిపింది. తొలుత వార్షికంగా 1.2 కోట్ల మంది ప్రయాణికుల నిర్వహణా సామర్థ్యంతో ప్రారంభమైన ఈ ఎయిర్పోర్ట్… విస్తరణ తర్వాత 3.2 కోట్ల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించే సామర్థ్యం నెలకొంటుందని జీఎమ్మార్ పేర్కొంది. వివరాలివీ…