న్యూఢిల్లీ, జూలై 22: హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్(హెచ్యూఎల్) విశ్లేషకుల అంచనాలకు మించి రాణించింది. ఈ ఏప్రిల్-జూన్లో రూ.2,100 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. నిరుడు రూ.1,897 కోట్ల లాభంతో పోలిస్తే 10.7 శాతం అధికమని కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈసారి రూ.11,996 కోట్ల విక్రయాలు జరిపింది. కరోనా ఉదృతమైనప్పటికీ అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని కంపెనీ సీఎండీ సంజీవ్ మెహతా తెలిపారు.