న్యూఢిల్లీ : భారతదేశంలో కొవిడ్-19 థర్డ్ వేవ్ నవంబర్, డిసెంబర్ నెలలో రావచ్చునని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎపిడెమియాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ గిరిధర్ బాబు అని చెప్పారు. మరో ఘోర వేవ్కు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అందువల్ల దీపావళికి ముందుగానే టీకాలు వేసే కార్యక్రమాన్ని పూర్తిచేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
థర్డ్ వేవ్ యువకులను ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని నేషనల్ కొవిడ్-19 టాస్క్ఫోర్స్ సభ్యుడు కూడా అయిన ప్రొఫెసర్ గిరిధర్బాబు చెప్పారు. అయితే, థర్డ్ వేవ్ రావడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. నవంబర్, డిసెంబర్ నెలలో థర్డ్ వేవ్ రాకముందే వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చునని తెలిపారు. ఆ సమయానికి ఇప్పటికే టీకాలు తీసుకున్నవారిలో రోగనిరోధకశక్తి అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్ద వయసు వారికి ముందుగా టీకాలు వేయడంపై దృష్టిపెట్టాలని, సమర్థవంతమైన అమలు అవసరమని సూచించారు.
భారతదేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నదని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ కే విజయ్ రాఘవన్ మీడియాతో చెప్పారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ కొత్త వేరియంట్లకు వ్యతిరేకంగా కూడా ప్రభావవంతంగా ఉంటుందని తెలిపారు. కరోనా వైరస్లో మార్పులకు అవకాశం ఉందని అంచనా వేస్తూ టీకాలో కూడా మార్పులకు సిద్ధంగా ఉండాలన్నారు.
ప్రకటనలకు ఖర్చు చేయడమే తప్పా ఆప్ చేసిందేమీ లేదు : బీజేపీ
పెరోల్పై ఖైదీల విడుదలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్ణయం
బెంగాల్లో హింసను నిరసిస్తూ అమెరికాలో ప్రదర్శనలు
18 ఏండ్ల పైబడిన వారికి టీకాలు.. ప్రచారాన్ని ప్రారంభించిన తీరత్ సింగ్
అప్పట్లో అమ్మతో ఇప్పటి బిలియనీర్.. ఎవరో తెలుసా..?
ప్రైవసీ పాలసీని గడువు వాయిదా వేసుకున్న వాట్సాప్.. ఎందుకో తెలుసా..?
అమెరికా చమురు పైప్లైన్పై సైబర్ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటన
మాడ్రిడ్ ఓపెన్ : రెండోసారి టైటిల్ గెల్చుకున్న జ్వెరెవ్
దక్షిణాఫ్రికా దేశాధ్యక్ష పీఠంపై నెల్సన్ మండేలా.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..