EPF advance | కరోనా మహమ్మారి వేళ తన సబ్స్క్రైబర్లకు అండగా నిలిచేందుకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) ముందుకు వచ్చింది. సెకండ్ వేవ్తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈపీఎఫ్వో సభ్యులు.. కోవిడ్-19 అడ్వాన్స్ తీసుకోవచ్చు. కరోనాతోపాటు ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్స కోసం ఒక ఈపీఎఫ్వో సబ్స్క్రైబర్ రూ.లక్ష వరకు అడ్వాన్స్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు అడ్వాన్స్ విత్ డ్రా చేసుకోవడానికి హాస్పిటలైజేషన్ ఖర్చుపై ఎటువంటి అంచనాలను సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకోసం ఆన్లైన్లో ఈపీఎఫ్వో పోర్టల్లో లాగిన్ కావాలి. మీ క్లయిమ్ కోసం ప్రాసెస్ను చెక్ చేసుకోవాలి.
ఈపీఎఫ్వో నుంచి మెడికల్ ఎమర్జెన్సీల కోసం రూ.లక్ష అడ్వాన్స్ విత్ డ్రాయల్ క్లయిమ్ కోసం అనుసరించాల్సిన 10 చర్యలివే:
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) కింద సభ్యులు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ప్రత్యేక విత్ డ్రాయల్స్ చేసుకునేందుకు అనుమతించింది. దీనికి అనుగుణంగా 1952 నాటి ఎంప్లాయిమెంట్స్ ప్రావిడెండ్ ఫండ్స్ స్కీమ్ నిబంధనలను మారుస్తూ సవరణలు ఆమోదించారు. ఈ మేరకు గత మే నెలలో అధికారిక గెజిట్లో ప్రచురించారు. దీని ప్రకారం మూడు నెలల కనీస వేతనం ప్లస్ డీఏ కలిపిన మొత్తం, మొత్తం సభ్యుడి ఖాతాలో ఉన్న మొత్తంలో 75 శాతం ఉపసంహరించుకోవచ్చు.