ఆత్మకూరు(ఎం), జూన్7: మండలంలో లాక్డౌన్ 27వ రోజు ప్రశాంతంగా జరిగింది. ప్రజలు సడలింపు సమయం లోనే నిత్యావసరాలను కొనుగోలు చేశారు. వ్యాపారులు మధ్యాహ్నం ఒంటి గంటలోపే షాపులు మూసేసి లాక్డౌన్ కు సహకరించారు. మండల కేంద్రంలోని మోత్కూరు-భువనగిరి ప్రధాన రోడ్డుపై లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రాకపోకలు సాగించిన వాహనాలను పోలీసులు తనిఖీ చేసి కేసులు నమోదు చేశారు.
వాహనాల తనిఖీ
మోత్కూరు , జూన్ 7: మండలంలో లాక్డౌన్ ప్రశాంతం గా జరిగింది. సడలింపు సమయంలో ప్రజలు నిత్యావసరాలను కొనుగోలు చేశారు. వ్యాపారులు మధ్యాహ్నం ఒంటి గంటలోపే షాపులను మూసేశారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. పాటిమట్ల క్రాస్ రోడ్డు, అనాజిపురం కూడలిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానా విధించారు. భువనగిరి, నల్లగొండ, నార్కటపల్లి, తిరుమలగిరి నుంచి రాకపోకలు సాగించిన వాహనాలను పోలీసులు తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన బైక్లను సీజ్ చేసి కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు ఎస్ఐ ఉదయ్కిరణ్ తెలిపారు.
రామన్నపేటలో..
రామన్నపేట, జూన్7: మండలంలో సోమవారం వారాంతపు సంత జరిగింది. వ్యాపారులు ఒంటి గంటలోపే తమ షాపులను మూసివేశారు. రెండు గంటల తర్వాత ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారా యి. మండలకేంద్రంతోపాటు గ్రామాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు. చెక్పోస్ట్ వద్ద ఎస్ఐ వాహనాల తనిఖీ చేపట్టారు.
సడలింపు సమయంలో నిత్యావసరాల కొనుగోలు
మోటకొండూర్, జూన్ 7: కొవిడ్ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మండలంలో సోమవారం ప్రశాంతంగా జరిగింది. ప్రజలు సడలింపు సమయంలోనే రోడ్లపైకి వచ్చి నిత్యావసరాలను కొనుగోలు చేశారు. మండలంలో లాక్డౌన్ అమలు తీరును పోలీసులు పర్యవేక్షించారు.
ఇండ్లకే ప్రజలు పరిమితం
అడ్డగూడూరు, జూన్ 7 : మండలంలో వ్యాపారులు ఉదయం 6గంటలకు షాపులు తెరిచి మధ్యాహ్నం ఒంటి గంటకు మూసేశారు. మండలంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేసి మినహాయింపు ఉన్న వాహనాలను అనుమతించి, మిగతా వాటికి జరిమానా విధించారు. ప్రజలు లాక్డౌన్ సమయంలో ఇండ్లకే పరిమితం కావడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
లాక్డౌన్కు సహకరిస్తున్న ప్రజలు
యాదగిరిగుట్ట రూరల్, జూన్ 7: యాదగిరిగుట్ట మండలంలో సోమవా రం లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. అన్ని గ్రామాల్లో యాదగిరిగుట్ట పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. వ్యాపారులు షాపులను మధ్యాహ్నం ఒంటి గంటలోపే మూసేశారు. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదా రిపై వాహనాల రద్దీ చాలా వరకు తగ్గిపోయింది. గ్రామాల్లోని ప్రజలు లాక్డౌన్కు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు.
నిర్మానుష్యంగా రోడ్లు
గుండాల, జూన్ 7: మండలంలో లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం 1 గంటలోపు ప్రజలు నిత్యావసరాలను కొనుగోలు చేశారు. 1 గంట తర్వాత వ్యాపారులు షాపులను మూసివేశారు. ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు మం డల వ్యాప్తంగా లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు. మధ్యాహ్నం తర్వాత బయటకు వచ్చిన వాహనదారులకు జరిమానా విధించారు.