చేపల కోసం చెరువు తూములు తీయడంతో బయటకు పోతున్న నీరు
నూతనకల్, ఏప్రిల్ 9 : ప్రతి ఎకరాకూ సాగు నీరు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మండలంలోని అన్ని చెరువులను కాళేశ్వర జలాలతో నింపుతున్నది. కానీ కొందరు తమ స్వార్థం కోసం ఎంతో విలువైన నీటిని వృథా చేస్తున్నారు. మండలంలోని తాళ్లసింగారం గ్రామ శివారులోని రామసముద్రం చెరువు కాళేశ్వరం జలాలతో పూర్తిస్థాయిలో నిండింది. కానీ కొందరు చెరువులోని చేపలు పట్టేందుకు తూముల ద్వారా నీటిని విడుదల చేస్తుండడంతో అవి వృథాగా వాగులోకి వెళ్తున్నాయి. తాము ఎన్ని మార్లు నిలువరించినా వారు వినిపించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. తూములు తీయడం ద్వారా నీరంతా వృథాగా బయటికి వెళితే చెరువు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని చెరువు నీరు బయటకు వృథాగా పోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
శామీర్పేట చెరువులో మహిళా మృతదేహం లభ్యం