యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాతో పాటుగా కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తోను ఓ సినిమా చేయనున్నాడు జూనియర్. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం పాన్ ఇండియా మూవీగా ఉంటుందని సమాచారం.
ఈ రోజు ప్రశాంత్ నీల్ బర్త్ డే కావడంతో ఎన్టీఆర్తో పాటు మైత్రి మూవీ మేకర్స్ ఆయనకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రదర్ నీ దర్శకత్వంలో కలిసి సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు స్పష్టం చేశారు. మరో వైపు మైత్రి మూవీ మేకర్స్ అయితే “మాస్”సివ్ జర్నీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తెలిపారు. వీరి ట్వీట్స్ని బట్టి చూస్తుంటే ఈ చిత్రం ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ గా ఉంటుందని అవుతుంది.