Honda to EV Bikes | దేశంలోని ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లోకి ప్రముఖ టూ వీలర్స్ సంస్థ హోండా మోటారు సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) రంగ ప్రవేశం చేయనున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఆవిష్కరించడానికి సంసిద్ధం అవుతున్నట్లు హెచ్ఎంఎస్ఐ సీఈవో కం మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ అశుషి ఒగాటా చెప్పారు.
ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ, విక్రయాలకు గల అవకాశాలపై ప్రస్తుత ఫెస్టివ్ సీజన్ ముగిసిన తర్వాత తమ డీలర్లతో చర్చిస్తామని తెలిపారు. జపాన్లోని పేరెంట్ బాడీ హోండా మోటార్స్తో సవివరంగా చర్చించాక నిర్ణయం తీసుకుంటుందన్నారు. యాక్టివా, షైన్ వంటి పాపులర్ మోడల్ స్కూటర్లు, బైక్లను విక్రయిస్తోంది హెచ్ఎంఎస్ఐ.
గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని, పలు విదేశీ సంస్థలతోపాటు ఈవీ సెగ్మెంట్లోకి ప్రవేశించాలని భావిస్తోంది. నగర పరిధిలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్తో ప్రయాణం తేలికవుతుందన్నారు. సుదూర ప్రయాణాలకు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనువుగా ఉండబోవని అశుషి ఒగాటా వివరించారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
United Nations : చరిత్రలో ఈరోజు : ఐక్యరాజ్య సమితికి 76 ఏండ్లు
Honeytrap : హనీట్రాప్లో ఆర్మీ జవాన్.. రహస్యపత్రాలు పంపుతుండగా పట్టివేత
Congress New Rules : కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కావాలా? అయితే, ఈ నిబంధనలు పాటించాల్సిందే!
జమ్ముకశ్మీర్లో తాలిబాన్ ప్రభావం కనిపిస్తోంది : సీడీఎస్ బిపిన్ రావత్ హెచ్చరిక
10 దేశాల రాయబారులను బహిష్కరించిన టర్కీ