న్యూఢిల్లీ, ఆగస్టు 19: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) సరికొత్త బైకును మార్కెట్కు పరిచయం చేసింది. సీబీ200 ఎక్స్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు రూ.1.44 లక్షలకు లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. భారత్ ప్రమాణాలు-6 కి తగ్గట్టుగా రూపొందించిన ఈ బైకు 184 సీసీ ఇంజిన్తో తయారుచేసింది.