న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల వివిధ రంగాల పరిశ్రమలు ఆదా పేరిట ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.. ప్రతి రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు కొడిగట్టిపోయాయి.
కానీ ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగ నియామకాలు వేగం పుంజుకున్నాయి. గత నెలలో వివిధ రంగాల్లో కొత్త కొలువులు రెండు శాతం పడిపోయాయని స్కీకీ మార్కెట్ నెట్వర్క్ పేర్కొంది.
కానీ మే నెలలో సాఫ్ట్వేర్ డెవలపర్, డెవ్ యాప్స్, క్లౌడ్, డేటా ఇంజినీర్ వంటి కొలువులకు డిమాండ్ పెరిగింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే గత నెలలో 12-16 శాతం మందికి కొత్తగా ఐటీ, టెక్నాలజీ రంగంలో కొలువులు వచ్చాయి.
రిటైల్ సెక్టార్లో ఉద్యోగాలు 16 శాతం డౌన్ అయ్యాయి. బ్యాంకింగ్ రంగంలో నూతన కొలువుల నియామకం 12 శాతం తగ్గాయి. ఎఫ్ఎంసీజీ రంగంలో 12 శాతం కొలువులు తగ్గాయి. కానీ కరోనా రెండో వేవ్ ప్రభావంతో బీమా రంగంలో ఉద్యోగ నియామకాల్లో 5 శాతం గ్రోత్ రికార్డయింది.
సేల్స్, మార్కెటింగ్, సైట్ ఇంజినీరింగ్, హ్యూమన్ రీసోర్సెస్, ఫైనాన్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ వంటి నియామకాలు నిరాశజనకంగా ఉన్నాయి. 8-12 ఏండ్ల మధ్య అనుభవం గల మిడ్ లెవల్ ఎగ్జిక్యూటివ్లకు 5%, 16 ఏండ్ల అనుభవం గల లీడర్ షిప్ స్థాయి అధికారుల నియామకాలకు 12 % డిమాండ్ ఉంది.
ఎంట్రీ లెవల్, ఫ్రెషర్ ఉద్యోగ నియామకాలు నాలుగు శాతం తగ్గుముఖం పట్టాయి. వర్క్ ఫ్రం హోంతోపాటు ఆన్ లైన్ సేవలకు డిమాండ్ పెరగడంతో టెక్ దిగ్గజ సంస్థల్లో నియామకాలు పుంజుకున్నాయని స్కీ కీ కో ఫౌండర్ కరుణ్జిత్ కుమార్ ధీర్ చెప్పారు.