ముంబై ,మే 7 :స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ఉన్నాయి. దీంతో సెన్సెక్స్ 49,169.14 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,417.64 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,169.14 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 6.50 శాతం, అదానీ పోర్ట్స్ 4.38 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 3.53 శాతం, హిండాల్కో 3.32 శాతం, జేఎస్ డబ్ల్యూ స్టీల్ 2.51 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 4.16 శాతం, హీరో మోటో కార్ప్ 2.22 శాతం, బజాజ్ ఆటో 1.52 శాతం, ఐచర్ మోటార్స్ 0.99 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.87 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టాటా స్టీల్, హిండాల్కో, జేఎస్డబ్ల్యు స్టీల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ ఉన్నాయి. 0.34 శాతం అంటే సెన్సెక్స్ 168.59 పాయింట్లు ఎగిసి 49,121.65 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,816.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,863.05 వద్ద గరిష్టాన్ని, 14,771.45 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 0.44శాతం అంటే 64.90 పాయింట్లు ఎగిసి 14,789.70 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.