న్యూఢిల్లీ : అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ తన బైక్లు, స్కూటర్ల ధరలను రూ 3000 వరకూ పెంచింది. కొత్త ధరలు ఈనెల 20 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. ముడిపదార్ధాల ధరలు స్ధిరంగా పెరుగుతుండటంతో వాహన ధరలను పెంచకతప్పలేదని హీరో మోటో కార్ప్ ఓ ప్రకటనలో తెలిపింది.
మోడల్, మార్కెట్ను బట్టి ధరల పెంపు వర్తిస్తుందని పేర్కొంది. రాబోయే పండుగ సీజన్లో వాహన విక్రయాలు ఊపందుకుంటాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో కంపెనీ 18 లక్షల బైక్లు, స్కూటర్లను విక్రయించింది. గత ఏడాది పోలిస్తే ఇది 12 శాతం అధికమని తెలిపింది.