సిద్దిపేట, జూన్ 27 : సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం వర్షం జోరుగా కురిసింది. పట్టణంతోపాటు సిద్దిపేట అర్బన్, రూరల్, చిన్నకోడూరు, నంగునూరు, నారాయణరావుపేట మండలాల్లో వర్షం ప డింది. నంగునూరు మండలం పాలమాకుల లో అక్కడక్కడ చెట్లు విరిగిపోయాయి.
చేర్యాల ప్రాంతంలో భారీగా..
చేర్యాల, జూన్ 27 : చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో శనివారం అర్థరాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షంతో వాగులు, వాంకల్లోకి నీళ్లు వచ్చి చేరాయి. ఆదివారం సాయంత్రం మరోసారి భారీ వర్షం కు రవడంతో రోడ్లపైకి నీళ్లు వచ్చిచేరాయి. కొన్ని రోజులుగా మొఖం చాటేసిన వరుణుడు కరు ణించడంలో రైతులు సంతోష పడుతున్నారు.
మద్దూరులో 9సెం.మీటర్ల వర్షం
మద్దూరు, జూన్27: ఉమ్మడి మద్దూరు మండల పరిధిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఏఎస్వో మహేందర్ తెలిపారు. పంట పొలాల్లో వరదనీరు పారడంతో ఇసుక మేటలు పేరుకపోయాయి. అదేవిధంగా వాగు లు, వంకలు పొంగిపొర్లాయి. కొన్ని గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
కోహెడ మండలంలో మోస్తరుగా..
కోహెడ, జూన్ 28 : మండలకేంద్రం కోహె డతోపాటు బస్వాపూర్, సముద్రాల, నాగసముద్రాల గ్రామాల్లో మోస్తరు వర్షం పడింది. రెండురోజుల పాటు వర్షం పడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లమ్మ వాగులోకి వరద నీరు చేసి ప్రవహిస్తుంది.
కుంటల్లోకి చేరుతున్న నీరు..
తొగుట, జూన్ 27 : వర్షం పడడంతో రైతు లు ఊపిరి పీల్చుకున్నారు. చెరువులు, కుంట ల్లోకి నీళ్లు చేరుతున్నాయి. తొగుటలో మెయిన్ రోడ్పై నీళ్లు చేరాయి. వాన పడుతుండడంతో విత్తనాలు పెట్టడం, వరినార్లు పోసే పనులను రైతులు చేపట్టనున్నారు. కూడవెల్లి వాగులో వరదనీరు చేరడంతో పొంగి ప్రవహిస్తుంది.
నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
నంగునూరు : మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వర్షానికి, బలమైన గాలికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పాలమాకులలో రోడ్డుకు ఇరువైపులా చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో స్తంభాలు కూలిపోయాయి. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.