న్యూఢిల్లీ, జూలై 20: దేశీయ మార్కెట్లోకి సరికొత్త గ్లామర్ బైకును పరిచయం చేసింది హీరో మోటోకార్ప్. ఢిల్లీ షోరూంలో ఈ బైకు రూ.78,900 ప్రారంభ ధరతో లభించనునుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్తో అనుసంధానం, యూఎస్బీ చార్చర్తోపాటు ఇతర నూతన ఫీచర్స్తో ఈ బైకును రూపొందించింది సంస్థ. వీటిలో డ్రమ్ బ్రేక్ కలిగిన బైకు రూ.78,900కి లభించనుండగా, డిస్క్ బ్రేక్తో తయారైన బైకు రూ.83,500గా నిర్ణయించింది.