న్యూఢిల్లీ: బిజినెస్లకు వెన్నముకగా ఐటీ, సేల్స్ రంగాలు నిలవడంతో ఆయా రంగాల్లో ఉద్యోగ నియామకాలకు డిమాండ్ పెరిగింది. వేతనాల్లోనూ వృద్ధి నమోదు చేసుకున్నది. ఇటీవల ‘టీం లీజ్ జాబ్స్ & శాలరీస్ ప్రైమర్ రిపోర్ట్ 2021’ అనే పేరుతో సమర్పించిన నివేదిక ప్రకారం ప్రతిభను బట్టి ఐటీ రంగంలో సగటున 8.55, సేల్స్ విభాగంలో 9.82 శాతం వేతనాలు పెరిగాయి.
ఐటీ రంగంతోపాటు సూపర్ స్పెషలైజ్డ్ ఉద్యోగాల్లో 11 శాతానికి పైగా వేతనాల్లో ఇంక్రిమెంట్లు పెరిగాయి. కరోనా రెండో వేవ్ ఉధృతంగా సాగినా.. ఈ రంగాల్లో ఉద్యోగాలపై ఎటువంటి ప్రభావం పడలేదు. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్ అండ్ అనుబంధ పరిశ్రమలు, టెక్నాలజీ అండ్ నాలెడ్జ్ సర్వీసెస్లో 10 శాతం శాలరీ గ్రోత్ నమోదైంది.
బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్కతా నగరాల్లో వివిధ రంగాల ఉద్యోగులకు 12 శాతానికి పైగా ఇంక్రిమెంట్లు లభించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (బీపీవో అండ్ ఐటీ అనేబుల్ సర్వీసెస్), ఈ-కామర్స్, టెక్ స్టార్టప్, హెల్త్కేర్ అనుబంధ పరిశ్రమలు, ఐటీ, నాలెడ్జ్ సర్వీసులు, డిజిటల్ ఇమేజింగ్ లీడర్ రంగాల్లో కొలువులకు డిమాండ్ పెరిగింది.