న్యూఢిల్లీ, జూన్ 30: తెలంగాణ, ఏపీసహా పలు రాష్ర్టాల మార్కెట్లకు ఆరోక్య బ్రాండ్ పన్నీర్ను పరిచయం చేసినట్లు డైరీ సంస్థ హట్సన్ ఆగ్రో ప్రోడక్ట్ లిమిటెడ్ బుధవారం ప్రకటించింది. ఇప్పటికే విపణిలో ఆరోక్య బ్రాండ్లో పాలు, పెరుగును విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు పన్నీర్నూ ప్రారంభించినట్లు చెప్పింది. 200 గ్రాముల పన్నీర్ ప్యాక్ ధరను రూ.100గా నిర్ణయించింది.