న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: హెచ్డీఎఫ్సీ ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 15.8 శాతం పెరిగి రూ.8,434 కోట్లుగా నమోదైంది. గతేడాది రూ.7,280 కోట్ల లాభాన్ని గడించింది. కన్సాలిడేటెడ్ అడ్వాన్స్లు ఏడాది ప్రాతిపదికన 13.6 శాతం పెరిగి రూ.10,43,671 కోట్ల నుంచి రూ.11,85,284 కోట్లకు చేరుకున్నట్లు బ్యాంక్ తెలిపింది. జనవరి-మార్చి మధ్యకాలానికిగాను బ్యాంక్ రూ.40,909.49 కోట్ల ఆదాయాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.38,287.17 కోట్లుగా ఉన్నది. గతేడాది మొత్తానికి రూ. 1,55, 885.28 కోట్ల ఆదాయంపై రూ.31,833 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.26 శాతం నుంచి 1.32 శాతానికి పెరిగినట్లు తెలిపింది. విలువ పరంగా చూస్తే రూ.12,649.97 కోట్ల నుంచి రూ.15,086 కోట్లకు చేరుకున్నాయి. నికర నిరర్థక ఆస్తుల విలువ కూడా 0.36 శాతం(రూ.3,542.36 కో ట్ల) నుంచి 0.40 శాతానికి(రూ.4,554. 82 కోట్ల) పెరిగాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి గత త్రైమాసికంలో బ్యాంక్ రూ.4,693.70 కోట్ల నిధులను వెచ్చించింది.