బెంగళూరు, జూలై 21: ఐటీ నిపుణులను కంపెనీలోనే అట్టిపెట్టుకునేందుకు సాఫ్ట్వేర్ కంపెనీలు డబుల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లతో పాటు కొత్త ఆఫర్లకు తెరతీసాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్… అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి బెంజ్ కారును ఆఫర్ చేయాలని ప్రతిపాదించింది. బోర్డు అనుమతి లభించగానే ఈ ప్రతిపాదనను అమలు చేస్తామని హెచ్సీఎల్ చీఫ్ హెచ్ఆర్ అప్పారావు వీవీ చెప్పారు.