న్యూఢిల్లీ, అక్టోబర్ 20: కన్జ్యూమర్ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ హావెల్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.326.36 కోట్ల నుంచి 7.34 శాతం తగ్గి రూ.302.39 కోట్లకు పరిమితమైనట్లు తెలిపింది. ఇదే సమయంలో ఆదాయం మాత్రం31.65 శాతం పెరిగి రూ.3,238.04 కోట్లకు పెరుగడం విశేషం. రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.3 లేదా 300 శాతం మధ్యంతర డివిడెండ్ను కంపెనీ ప్రకటించింది.