నేటి నుంచే అమలు
న్యూఢిల్లీ, జూన్ 14: బంగారు ఆభరణాలు, కళాఖండాలపై మంగళవారం నుంచి హాల్మార్క్ తప్పనిసరిగా ఉండాల్సిందే. నిజానికి ఈ నెల 1 నుంచే ఈ నిబంధన అమల్లోకి రావాల్సి ఉండగా, కరోనా దృష్ట్యా 15 రోజులు వాయిదా వేశారు. కాగా, హాల్మార్క్ నిబంధన అమలు కోసం భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ ప్రమోద్ తివారీ నేతృత్వంలో ఓ కమిటీ పనిచేయనున్నది.