జూన్ 26 దాకా పెంచిన కేంద్రం
న్యూఢిల్లీ, మే 31: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నెలసరి అమ్మకాల రిటర్నుల దాఖలుకున్న గడువును సోమవారం కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మే నెల జీఎస్టీఆర్-1 ఫారం ఫైలింగ్కు జూన్ 26దాకా అవకాశం కల్పించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు ఇవ్వాలన్న ఇటీవలి జీఎస్టీ మండలి నిర్ణయం మేరకు 15 రోజులు పొడిగించారు. అలాగే గత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను కంపోజిషన్ డీలర్ల వార్షిక రిటర్నుల దాఖలుకున్న గడువును మూడు నెలలు పెంచారు. జూలై 31 వరకు వీలు కల్పించారు. కంపెనీల చట్టం కింద నమోదైన పన్ను చెల్లింపుదారులు.. ఆగస్టు 31దాకా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (డీఎస్సీ)కు బదులు ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ)ను వినియోగించి జీఎస్టీ రిటర్నులను సమర్పించవచ్చని సీబీఐసీ తెలిపింది.