నిబంధనల్ని సవరించిన సీబీఐసీ
న్యూఢిల్లీ, మే 19: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రిఫండ్ నిబంధనలను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) హేతుబద్దీకరించింది. ఈ మేరకు జీఎస్టీ రూల్స్ను సవరించింది. దీంతో జీఎస్టీ రిఫండ్ క్లెయిమ్ నియమాలు సరళతరమైనైట్లెంది. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులకు దరఖాస్తు ఉపసంహరణకు అనుమతి లభించింది. తమ అప్లికేషన్లను సరిదిద్దుకోవడం సులభమైంది. రిఫండ్ క్లెయిమ్ దాఖలు కోసం అందుబాటులో ఉన్న మొత్తం కాల పరిమితిలో రిఫండ్ క్లెయిమ్ దాఖలుకు, అందులో లోపాలపై అధికారులు జారీచేసే నోటీసుకు మధ్య ఉన్న వ్యవధి లెక్కలోకి రాదని సీజీఎస్టీ నాల్గో సవరణ నిబంధనల్లో సీబీఐసీ పేర్కొన్నది. దీంతో ఆలస్యం పేరిట క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు దాదాపుగా తగ్గిపోయినైట్లెంది. దరఖాస్తులో తప్పుల కారణంగా కొత్త దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వ్యాపారులకు నోటీసులు ఇస్తున్నారని, అవి అందేలోగా దరఖాస్తుకున్న సమయం కాస్తా ముగిసిపోతున్నదని నిపుణులు అంటున్నారు.