Grofors | తక్షణం ఈ-కామర్స్ సంస్థగా విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తోంది గ్రోఫోర్స్. ఇప్పటివరకు ఆన్లైన్ ఆర్డర్లు తీసుకుని నిత్యావసర వస్తువులు సరఫరా చేసింది. తన విస్తరణ ప్లాన్లో భాగంగా దేశంలోని 13 నగరాల్లోని వ్యాపారులతో గ్రోఫోర్స్ ఒప్పందాలు కుదుర్చుకున్నది. భవిష్యత్లో ఆపిల్ ఐఫోన్లతోపాటు అన్ని రకాల మొబైల్ ఫోన్లనూ ఇదే పద్ధతిలో సరఫరా చేయాలని భావిస్తోంది.
ఇప్పటికే ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే సరకులను సరఫరా చేసే సేవలకు గత ఆగస్టులో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, జైపూర్ తదితర 10 నగరాల్లో గ్రోఫోర్స్ శ్రీకారం చుట్టింది. మొబైల్ ఫోన్లకూ ఈ సేవలను విస్తరించాలని కంపెనీ భావిస్తోంది.
‘ఇన్స్టంట్ కామర్స్ విభాగంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్న వ్యాపారవేత్తల కోసం అన్వేషిస్తున్నాం. ఇప్పటికే 13 నగరాల్లో 86 స్టోర్లతో జత కట్టాం’ అని గ్రోఫోర్స్ గ్రోఫోర్స్ సీఈఓ అల్బీందర్ థిండ్సా తెలిపారు.