హైదరాబాద్, జూలై 27: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న గ్రాన్యూల్స్ ఇండియా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల్లో సంస్థ రూ.89.85 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.125 కోట్లతో పోలిస్తే 28.12 శాతం క్షీణించింది. అటు విక్రయాలు కూడా రూ.742.92 కోట్ల నుంచి రూ.732.12 కోట్లకు పడిపోయాయి. రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు 25 పైసలు మధ్యంతర డివిడెండ్ను ప్రతిపాదించింది.
.