న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ల సేకరణను కేంద్రీకృతంగా చేపట్టాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అధికంగా వ్యాక్సిన్లు వృధా అవుతున్నాయని, వ్యాక్సినేషన్ జాప్యం అవుతుందన్న విపక్ష పాలిత రాష్ట్రాల విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కేంద్రీకృతంగా వ్యాక్సిన్ల సేకరణను మేం తీవ్రంగా పరిశీలిస్తున్నాం అని ఆమె చెప్పినట్లు తెలుస్తున్నది. వ్యాక్సిన్ల సేకరణకు గ్లోబల్ టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వాల బిడ్లకు స్పందన లేకపోవడంతోపాటు అత్యధిక విపక్ష పాలిత రాష్ట్రాలు కేంద్రాన్నే వ్యాక్సిన్లు సేకరించాలని కోరుతున్నాయి.
ఇటీవలే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్కు ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబా కిశోర్ దాస్ లేఖ రాస్తూ కేంద్రమే వ్యాక్సిన్లు సేకరించాలని నొక్కి చెప్పారు. నబా కిశోర్ దాస్ డిమాండ్కు కేరళ, జార్ఖండ్తోపాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇందుకు మద్దతు వచ్చింది.
చర్చల ద్వారా చౌక ధరకు వ్యాక్సిన్లు సేకరించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ నెల ఆరో తేదీ నాటికి రాష్ట్రాలు 246 మిలియన్ల వ్యాక్సిన్లు అందుకున్నాయి. సుమారు వాటి వద్ద 16.3 మిలియన్ల డోస్లు సిద్ధంగా ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కేంద్రం వ్యాక్సినేషన్ కోసం రూ.35 వేల కోట్లు కేటాయించింది. అవసరమైతే మరిన్ని నిధులు కేలాయిస్తామని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ మే ఒకటో తేదీ నుంచి మూడో దశ వ్యాక్సినేషన్ చేపడతామని గత ఏప్రిల్ 19వ తేదీన కేంద్రం ప్రకటించింది. ఈ ప్లాన్ కింద 50 శాతం దేశీయ వ్యాక్సిన్లు సేకరించాల్సి ఉంటుంది. 45 ఏండ్లు దాటిన వారికి కేంద్రమే వ్యాక్సినేసన్ చేస్తుంది.
25 శాతం 18-44 ఏండ్ల మధ్య వయస్కులకు రాష్ట్రప్రభుత్వాలు, మిగతా 25 శాతం ప్రైవేట్ దవాఖానాలు వ్యాక్సినేషన్ చేయాలని కేంద్రం ప్రకటించింది. గ్లోబల్ సప్లయర్ల నుంచి వ్యాక్సిన్లు సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం స్వేచ్ఛనిచ్చింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
చరిత్రలో ఈరోజు.. తొలి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం
సెంట్రల్ బ్యాంక్, ఐఓబీలో వాటా విక్రయానికి కేంద్రం సన్నాహలు
అన్లాక్ షురూ : మెట్రో రైల్, మార్కెట్లు ఓపెన్
కొవిడ్ చికిత్స నుంచి ఐవర్మెక్టిన్, డాక్సీసైక్లిన్ ఔట్.. సీటీ స్కాన్లూ వద్దు!
దేశంలో ప్రమాదకరమైన కరోనా మరో వేరియంట్ గుర్తింపు
కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్తోనే ఎక్కువ యాంటీబాడీలు!
మళ్లీ అమ్మాయి పుట్టిందని భార్యా పిల్లలను బావిలోకి తోసేసిన భర్త
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఢిల్లీ ఎయిమ్స్లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
అధిష్ఠానం కోరితే రాజీనామా చేస్తా
జూలై 1 నుంచి బ్యాడ్ బ్యాంక్ ప్రారంభం?! ఎందుకంటే?!
చోక్సీ అప్పగింత డౌటేనా? అసలేం జరిగింది?!
స్వల్పకాలం కార్ల ధరలు స్టేబుల్: ఫోక్స్ వ్యాగన్