న్యూఢిల్లీ, ఆగస్టు 25: కెనడాకు చెందిన యాంకరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ రూ.15,000 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డీఐ) ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్రవేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోది అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ)కెనడా పెన్షన్ ఫండ్కు సబ్సిడరీ అయిన ఈ సంస్థ ఎఫ్డీఐ ప్రతిపాదనను ఆమోదించింది. దేశంలో ఇన్ఫ్రా, నిర్మాణ రంగాల్లో యాంకరేజ్ ఈ పెట్టుబడుల్ని చేస్తుంది. రవాణా, లాజిస్టిక్స్ విభాగాలతో పాటు ఎయిర్పోర్టులు, విమానయాన సంబంధిత వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు జరుపుతుందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. రోడ్లు, రైల్వేలు, ఎయిర్పోర్టులు, స్పోర్ట్స్ స్టేడియంలు, విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు, గ్యాస్ పైప్లైన్లను ప్రైవేటుకు లీజుకిచ్చే ప్రక్రియలో యాంకరేజ్ నిధులు అందిస్తుందని ప్రకటన వివరించింది.