ప్రముఖ నటుడు ఉన్ని రాజన్ భార్య ప్రియాంక అనుమానాస్పద స్థితిలో మరణించింది. బుధవారం తమ నివాసంలో ఆమె విగతజీవిగా కనిపించడం మలయాళ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ప్రియాంక ఆత్మహత్య చేసుకుందంటూ వార్తలు వస్తున్నా.. వరకట్నం కోసం వేధించి తమ అల్లుడే ప్రియాంకను చంపేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో అనుమానాస్పద మృతిగానే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
రాజన్ పి దేవ్.. ఈ నటుడి గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. మిలీనియం మొదట్లో తెలుగులో చాలా సినిమాలు చేశాడు. ఆదిలో మెయిన్ విలన్ కూడా ఈయనే. ఒక్కడు, ఖుషీ, దిల్ లాంటి సినిమాల్లో కూడా అద్భుతమైన నటనతో గుర్తింపు సంపాదించుకున్నాడు. దాదాపు 200 కి పైగా సినిమాల్లో నటించిన ఈ మలయాళ నటుడు 2009లో మరణించాడు. ఆ రాజన్ పి దేవ్ కుమారుడే ఉన్ని రాజన్. ఈయన ప్రియాంకను కొన్నేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆ గొడవలు ప్రియాంకను మానసికంగా, శారీరకంగా హింసించే స్థాయికి వెళ్లాయని ఆమె తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంలో ఉన్ని రాజన్పై ప్రియాంక పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఈ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఆమె మరణించడం పలు అనుమానాలకు తావిస్తుంది.
ప్రియాంక మృతిపై సమగ్ర విచారణ జరపాలని ఆమె తరఫు బంధువులు కోరుతున్నారు. ఉన్ని రాజనే హంతకుడు అని వారు ఆరోపించారు. ప్రియాంక నగలను కూడా తనే తీసుకున్నాడని ఆరోపించారు. అంతేకాకుండా మళ్లీ అదనపు కట్నం కోసం వేధించేవాడని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
జాతిరత్నం హీరోయిన్ గ్లామర్ పిక్స్.. వైరల్
రాధేతో నిరాశపరచిన ప్రభుదేవా..డైరెక్షన్కు బైబై చెప్పాలంటూ సూచన!
విష్ణు ప్రియ గ్లామర్ షో.. యువత ఫిదా
మిస్ కాల్ ఇస్తే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ మీ ముందుంటుంది: సోనూసూద్
నటి సోదరుడు, ప్రముఖ ఎడిటర్ కన్నుమూత
కెరీర్ కోసం ప్రేయసికి దూరంగా ఉన్న సుశాంత్ సింగ్ రాజ్పుత్
రెండవ డోసు కోవిడ్ టీకా తీసుకున్న సల్మాన్ ఖాన్