న్యూఢిల్లీ: బంగారం ఆభరణాలపై జూన్ ఒకటో తేదీ నుంచి హాల్మార్క్ ముద్ర తప్పనిసరి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. కల్తీని నివారించడంతోపాటు బంగారం ఆభరణాల తయారీ సంస్థలు ఫిట్ నెస్ ప్రమాణాలను పాటించడానికి వీలుగా కేంద్రం హాల్మార్క్ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయింది.
ఇప్పటికైతే బంగారంపై హాల్ మార్కింగ్ వేసి ప్యూరిటీ సర్టిఫికెట్ జారీ చేయడం స్వచ్ఛందంగా సాగుతున్నది. బంగారం లేదా వెండి నాణ్యతలో అవకతవకలను నివారించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. తొలిసారి 2019 నవంబర్లో బంగారం ఆభరణాలపై హాల్మార్కింగ్ చేయాలని ప్రకటించింది.
ఈ ఏడాది జనవరి 15వ తేదీ నుంచి బంగారం ఆభరణాలపై హాల్ మార్కింగ్ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. అంతకుముందుకు ఈ హాల్ మార్క్ నిబంధనను అమలు చేయడానికి జ్యువెల్లరీ ఆభరణాల తయారీ సంస్థలకు ఏడాదికి పైగా గడువు ఇచ్చింది.
కరోనా మహమ్మారి దేశంలో ఉధ్రుతంగా సాగుతున్న నేపథ్యంలో తొలుత నాలుగు నెలల గడువు పొడిగించింది. జ్యువెల్లర్ల అభ్యర్థన మేరకు జూన్ ఒకటో తేదీకి పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇక ముందు హాల్ మార్కింగ్ నిబంధనల అమలు గడువు పొడిగించడం కుదరదని కేంద్ర వినియోగ వ్యవహారాలశాఖ కార్యదర్శి లీనా నందన్ పీటీఐకి చెప్పారు. వచ్చే రెండు నెలల్లో లక్ష మంది జ్యువెల్లరీ వ్యాపారులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటారని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బిట్ కాయిన్ ఆల్టైం రికార్డు@62,377 డాలర్లు!
తెలుగు ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని ఉగాది శుభాకాంక్షలు
ఇదెక్కడి పోయేకాలం.. యువకుడి జననాంగం కోసేసిన నపుంసకులు..!
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు
రెండు కాళ్లు, మూడు చేతులతో.. ఒడిశాలో జన్మించిన అవిభక్త కవలలు
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
IPL 2021:టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్కతా
IPL 2021:టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్కతా
బాయ్ఫ్రెండ్తో ఐరాఖాన్ బాక్సింగ్..వీడియో వైరల్
కొవిడ్ అంతానికి చాలా సమయం పడుతుంది: డబ్ల్యూహెచ్ఓ
అంత తక్కువ ధరకు మా వ్యాక్సిన్ అమ్మలేం: ఆర్డీఐఎఫ్